హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 7,19,104 మంది ఓటర్లను కొత్తగా చేర్చినట్టు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. 5,26,867 ఓటర్లను జాబితా నుంచి తొలగించామని, 4,21,521 మంది ఓటర్లు చిరునామా మా ర్పు, పేర్ల సవరణ చేసుకున్నట్టు వివరించారు. మొత్తం ఓటర్లలో 80 ఏండ్లు దాటినవారు 4,54, 230 మంది ఉండగా, దివ్యాంగులు 5,28,405 మంది ఉన్నట్టు తెలిపారు. స్త్రీపురుష ఓటర్ల నిష్పత్తి 1000:1009గా ఉన్నట్టు పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు చెక్ చేసుకోవడానికి https:// voters.eci. gov.in వెబ్ సైట్, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు.
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి మరోమారు టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక్కడ మొత్తం 7,47,726 మంది ఓటర్లు ఉన్నారు. 7,12,868 ఓటర్లతో కుత్బుల్లాపూర్, 7,12,868 మంది ఓటర్లతో మేడ్చల్ వరుసగా రెండుమూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ఎల్బీనగర్ (6,00, 500), రాజేంద్రనగర్ (5,99, 678) నిలిచాయి. అతి తక్కువగా భద్రాచలంలో 1,51,940 మంది ఓటర్లు ఉండగా, అశ్వారావుపేటలో 1,58,274, బెల్లంపల్లిలో 1,75,508, చెన్నూరులో 1,93, 379, మంది ఓటర్లు ఉన్నారు.