హైదరాబాద్ : హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటల రాజేందర్ చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఈటలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఈటల రాజేందర్ గెలుపొందిన విషయం తెలిసిందే.