నెక్కొండ, సెప్టెంబర్ 11: నాంపల్లి నుంచి శాలిమార్ వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18046)లో సోమవారం పొగలు వచ్చాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గరలో రైలును నిలిపివేశారు. బోగి నుంచి పొగలు వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు భయంతో రైలు దిగారు. బ్రేక్జామ్తో పొగలు వచ్చినట్టు రైల్వే సిబ్బంది గుర్తించి పది నిమిషాల్లో మరమ్మతులు చేసి రైలును పంపించారు.