భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం మధ్యాహ్నం 2:13 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనాలు బయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.