న్యాల్కల్, ఫిబ్రవరి 6: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భూకంపం అంటూ వదంతులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.26 నుంచి 7.45 గంటల మధ్య మండలంలోని ముంగి, న్యాల్కల్, టేకూర్, మిర్జాపూర్ (ఎన్) గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు. టీవీల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఇండ్లల్లోంచి భయం తో బయటకు పరుగులు తీయగా, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.