కోహీర్ జనవరి 5 : కోహీర్ మండలంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మనియార్ పల్లి, బిలాల్ పూర్, గోటిగార్ పల్లి గ్రామాల్లో భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో భూమి కనిపించిందని, భూమిలో నుంచి భారీగా శబ్దం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు తీశారని గ్రామస్తులు తెలిపారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.