హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం కారణంగా 4 నెలలుగా పవర్ లూమ్ యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదురొంటున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.270 కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారిని ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న 20 వేల మంది పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 24 ఏండ్లుగా 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ను నిలిపివేశారని, సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కార్మికులకు 10 శాతం యార్న్ సబ్సిడీ ఇవ్వాలని, గత ప్రభుత్వం రూ.370 కోట్లతో ప్రవేశపెట్టిన ‘వరర్ టు ఓనర్’ పథకం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.