కుమ్రం భీం ఆసిఫాబాద్ : అర్హులైన లబ్ధిదారులందరికి పోడు పట్టాలు పంపిణీ చేస్తామని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న అర్హులైన లబ్ధిదారులకు పోడు పట్టాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే నేడు పోడు రైతులకు పట్టాలు అందుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో వినూత్నపథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.