హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. లండన్ నుంచి బయల్దేరిన సీఎం ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆరిటెక్ట్లతో వరుసగా భేటీ అయ్యారు. 56 కి.మీ. పొడవున మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పారులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై దాదాపు 70 సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ఆసక్తి ప్రదర్శించాయి.
తదుపరి సంప్రదింపుల కోసం త్వరలో రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రక నగరాలన్నీ నీటివనరుల వద్దే అభివృద్ధి చెందాయని, మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ ప్రపంచంలోనే అద్భుత నగరంగా మారుతుందని అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరారు. ఇతర నగరాలు, రాష్ట్రాలతో తాము పోటీపడటం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దుబాయ్లో ఆదివారం పనిదినం కావడంతో సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు సంప్రదింపులు కొనసాగించింది. సమావేశాల్లో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలి తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం సీఎం హైదరాబాద్కు చేరుకుంటారు.
దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు సందర్శన
పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర అధికారులతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. సై సాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పకనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్లో పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. ప్రాజెక్టు నిర్వహణ వ్యవహారాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక ప్రభావాలను సీఎం అకడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? ఎంత ఖర్చయింది? ఏయే సవాళ్లు ఎదురయ్యాయి? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
నేడు రాష్ర్టానికి సీఎం రేవంత్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్, లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్తోపాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతోపాటు అధికారుల బృందం వెళ్లింది. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి సీఎం లండన్ వెళ్లగా, పరిశ్రమల శాఖ మంత్రి సౌదీ అరేబియా వెళ్లారు. సీఎం లండన్ నుంచి సోమవారం ఉదయమే హైదరాబాద్ చేరుకుంటారు.