యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి ఒంటి గంట సమయం లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎమర్జెన్సీలో ఉన్నానని 108 అంబులెన్స్కు ఫోన్ చేశాడు. తీరా సిబ్బంది స్పాట్కు చేరుకున్నాక తనను జనగాంలో డ్రాప్ చేయాలని వేడుకున్నాడు. ఈ విచిత్ర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తిమ్మాపూర్ బైపాస్ వద్ద బుధవారం రాత్రి జరిగింది.
రమేశ్ అనే వ్యక్తి జనగాం జిల్లా లింగాల ఘనపూర్ వెళ్లాలి. ఆ సమయంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో.. ఆరోగ్యం బాగాలేదని 108కు కాల్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సి బ్బంది అకడి పరిస్థితిని చూసి అవాకయ్యా రు. తనను జనగాంలో డ్రాప్ చేయాలని అం బులెన్స్ సిబ్బందిని కోరాడు. రమేశ్ మద్యం మత్తులో ఉండటంతో అక్కడే వదిలేసి వెళ్లారు.