డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా దుండిగల్లో ధ్వంసం చేసిన కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల సమక్షంలో దుండిగల్లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఆవరణలో డ్రగ్స్ను కాల్చి వేశారు.
రెండేండ్లలో డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు ఎయిర్పోర్టులు, ఇతర ప్రాంతాల్లో 20.35 కిలోల హెరాయిన్, 4,812 కిలోల గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.