న్యూఢిల్లీ : అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు తక్కువగా విధించాలని, భారత్ మార్కెట్లో తమ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాషింగ్టన్ కోరుకుంటున్నదని.. అలా జరిగితే భారత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతు సంఘాల లీడర్లు చెబుతున్నారు. అమెరికా ఉత్పత్తులతో చిన్న, సన్నకారు రైతులు పోటీ పడలేరని అంటున్నారు. పాటియాలా రైతు సంఘం నాయకుడు రమీందర్ సింగ్ మాట్లాడుతూ..‘ఒకే బోనులో పులి, మేకను ఉంచితే ఎలా ఉంటుందో ఊహించండి. అమెరికా వ్యవసాయ రంగం పులి లాంటిది. ఇండియా వ్యవసాయం మేక లాంటిది. అందుకే రైతులు ఆందోళన
చెందుతున్నారు.