ఒకప్పుడు మల్కాజిగిరి అంటే ‘పానీ’పట్టు యుద్ధాలకు ప్రసిద్ధి. ఎక్కడ చూసినా బిందెలతో కొట్లాటలే. ఏ గల్లీకి పోయినా సిగపట్లే. మిషన్ భగీరథతో మల్కాజిగిరి ’పానీ’పట్టు యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టారు. ప్రజల దాహార్తిని తీర్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. రూ.708.54 కోట్లతో అనుకున్న సమయం కంటే ముందే ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి అపర భగీరథుడిగా కీర్తిని పొందారు. ప్రజలకు మెరుగైన నీటి సరఫరా కోసం గౌతమ్నగర్ డివిజన్లో రూ.10 కోట్లతో రిజర్వాయర్ను నిర్మిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి హామీ ఇస్తున్నారు.
ఏరియల్ వ్యూ: మల్కాజిగిరి
2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మల్కాజిగిరి నియోజకవర్గంగా ఏర్పడింది. గత పాలకులు నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తాగునీటి కష్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. బస్తీలు, కాలనీల్లో నీటి కోసం ’పానీ’పట్టు యుద్ధాలు జరిగేవి. ఖాళీ బిందెలతో జనం ధర్నాలు.. రాస్తారోకోలు చేసేవారు. తాగునీటి ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా? అని దినసరి కూలీలు ఇంటి వద్దనే ఉండేవారు.
ప్రజల దూప తీర్చిన అపర భగీరథుడు
ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాల్సిందేనని అప్పట్లోనే కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తాం.. అక్కాచెల్లెళ్లు బిందెలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని.. తాగునీటి గోస తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. మల్కాజిగిరి సర్కిల్లో రూ.338.54 కోట్లు, అల్వాల్ సర్కిల్లో రూ.190 కోట్లతో పనులు చేపట్టారు. వీటితో పాటు మరో రూ.180 కోట్లు కలిపి మొత్తం రూ.708.54 కోట్లతో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
మౌలాలి కమాన్ విస్తరణకు నిధులు
మల్కాజిగిరికి ఐకాన్గా ఉన్న చారిత్రాత్మక కట్టడం మౌలాలి కమాన్ను ప్రభుత్వం పునరుద్ధరించింది. వాహనాలు ఢీకొనడంతో ధ్వంసమైన ఈ కమాన్ పునరుద్ధరణకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కమాన్ విస్తరణ కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసి పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని చెల్లించింది.
మల్కాజిగిరి సర్కిల్లో..
ఫీడరు ప్రధాన లైన్లు: 8.09 కి.మీ.
మొత్తం పంపిణీ వ్యవస్థ: 380 కి.మీ.
పంపుహౌస్లు: 5 (సైనిక్పురి, మౌలాలి, వాజ్పేయినగర్, సాయినాథపురం, గౌతమ్ నగర్, జేఎల్ఎన్ఎస్ నగర్, డిఫెన్స్ కాలనీ).
మొత్తం నల్లా కనెక్షన్లు: 78,000
ఉచిత తాగునీటి పథకం
లబ్ధిదారులు: 54,000
పవర్ బోర్లు: 250
అల్వాల్ సర్కిల్లో..
ఫీడరు లైన్లు: 6.2 కి.మీ.
మొత్తం పంపిణీ వ్యవస్థ : 290 కి.మీ.
పంపు హౌస్లు: 2
(లోతుకుంట, బాలయ్యనగర్)
రిజర్వాయరు ్ల: 3 (మంగపురం కాలనీ)
మొత్తం నల్లా కనెక్షన్లు : 27,006
ఉచిత తాగునీటి పథకం
లబ్ధిదారులు: 15,052