9 వేల ఫిర్యాదులకు స్పందన
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): వరద బాధితులకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది అండగా నిలుస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఈ బృందాలు రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి. కాలనీలు, ఇండ్లు ఉన్న ప్రాం తాల్లో వరద నీరు తొలగిస్తున్నాయి.
పురపాలకశా ఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పర్యవేక్షణలో ఎప్పటికప్పు డు రెస్యూ, రిలీఫ్ ఆపరేషన్లను చేపడుతున్నాయి. 360 మంది శిక్షణ పొందిన నిపుణులు, 8 ఎల్ఎంవీ బృందాలు, 11 ట్రకులతో కూడిన మల్టీ యుటిలిటీ వాహనాలతో ఈ దళం విపత్తుల సమయంలో అధునాతన రెస్యూ మెషినరీతో కార్యకలాపాలను చేపడుతున్నది. ఇప్పటి వరకు డీఆర్ఎఫ్ 9 వేల ఫిర్యాదులకు స్పందించింది. గత ఏడాదిలోనే 2,133 ఫిర్యాదులను పరిష్కరించింది.