కమాన్చౌరస్తా, మే 10: పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. 106 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి, మరోసారి కరీంనగర్ జిల్లాలో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బుధవారం కొత్తపల్లి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించిన ఆయన మాట్లాడుతూ, అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూళ్లలో పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషివల్ల ఇంతటి ఘన విజయం సాధ్యమైందని చెప్పారు.
విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందిస్తూ సంచలన విజయాలతో దూసుకుపోతున్నామని పేర్కొన్నారు. 96 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 77 మంది 9.7, ఒకరు 9.6, 71 మంది 9.5, 463 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించారని వివరించారు. ఆయన వెంట విద్యార్థులతో పాటు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.