బంజారాహిల్స్, సెప్టెంబర్ 29: నలభై ఏండ్లు దాటిన వారందరూ ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని శాంతా బయోటిక్స్ చైర్మన్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి సూచించారు. శుక్రవారం వరల్డ్ హార్ట్డే సందర్భంగా బంజారాహిల్స్ కేర్ అవుట్ పేషెంట్ సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్డియాక్ సమస్యల నుంచి బయటపడినవారిని సత్కరించారు.
ఈ సందర్భంగా వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా తర్వాత అనేక మంది గుండెజబ్బుల బారినపడుతున్నారని తెలిపారు. మోతాదుకు మిం చి ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యపానం తదితర అలవాట్లు ఉన్నవారే గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పరిశోధనల్లో తేలుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో కేర్ అవుట్ పేషెంట్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ రూపస్ మంద, దవాఖాన సీవోవో నీలేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.