Dr Srinivas | తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ గడల శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో సేవలు చేస్తున్నానన్నారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నానన్న ఆయన.. తన మొదటి సేవ తన కులానికే చేస్తానన్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
తాను పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ నమ్ముతుందని అనుకుంటున్నానన్నారు. గడల శ్రీనివాస్ గతంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్గా పని చేశారు. రేవంత్రెడ్డి సర్కారు ఆయనను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయన లాంగ్ లీవ్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 2న దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఆయన ప్రజారోగ్య సంచాలకులుగా పని చేసి వార్తల్లో నిలిచారు. కరోనా సమయంలో తన పనితీరు, ప్రెస్ మీట్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రసంగాలు, పూజలతో వార్తల్లో నిలిచారు.