హైదరాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట రూపొందించిన పోస్టర్లను ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ద్వారానే తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు.