బాన్సువాడ, సెప్టెంబర్ 22 : కాంగ్రెస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బాన్సువాడ నియోజక వర్గంలోనే 2,400 ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు స్వాహా చేసి అవినీతికి పాల్పడ్డారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్లో 42, సాంబాపూర్లో 25 డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాం గ్రెస్ ఇంత పెద్దమొత్తంలో ఇండ్లు నిర్మించి ఉం టే ప్రస్తుతం ఇన్ని ఇండ్లు కట్టే అవసరం ఉండే దా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన త ర్వాత విచారణ జరిపితే కొంతమంది అధికారు లు ఉద్యోగాలు కోల్పోయారని, కొందరు నా యకులు జైలుకు పోయినట్టు తెలిపారు.
దేశం లో అనేక మంది ప్రధానులు, సీఎంలు వచ్చారని, కానీ పేదల తలరాత మార్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడమే తన ఆశయమని అన్నారు. నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్టు చెప్పారు. పార్టీలకతీతంగా నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అంతేకాని దొంగలపాలు చేయలేదని చెప్పారు. 11 వేలలో 2,570 ఇండ్లు గిరిజనులకు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇన్ని పథకాలు అమలు చేసే శక్తి కేసీఆర్కు తప్పితే మరెవరికీ లేదన్నారు. అవినీతికి పాల్పడిన డబ్బులతో ఎన్నికల్లో ఓట్లు కొనడానికి నాయకులు వస్తారని, అటువంటి వారిని గట్టిగా నిలదీయాలని సూచించారు.