యాదాద్రి భువనగిరి : ఎర్రవల్లి తరహాలో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్తో కలిసి ఆమె సందర్శించారు. గ్రామంలోని దళిత వాడలో పర్యటించి దళితబంధు లబ్ధిదారులతో ముచ్చటించారు.
యూనిట్ల నిర్వహణపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. దళిత బంధువును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. గ్రామస్థులు అంతా ఏకతాటిపైకి రావాలన్నారు. వారి వెంట కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.