మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న గొలుసు కట్టు చెరువులను అనుసంధానం చేయడానికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారని విద్యాశాఖ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి నుంచి మైలార్ దేవుల పల్లి వరకు రూ.1.57కోట్లు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్ట్రీ ట్ లైట్స్ను మంత్రి బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ రూ. 348.64 కోట్లు మంజూరు చేశారన్నారు. అందులో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్పేట, బడంగ్పేట, జల్పల్లికి రూ.94.41కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వరద ముంపు సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి అడిగిన దానికన్నా ఎక్కువ నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరుఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఎపుడూ ముం దుంటారన్నారు. ఇక నుంచి ఎంత వాన వచ్చినా వరదలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధు లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. గొలు సు కట్టు చెరువులను అనుసంధానం చేస్తూ వరద కాల్వ ల నిర్మా ణం చేయడానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. టెండర్ ప్రిక్రియ పూర్తి కాగానే పనులు ప్రా రంభిస్తామన్నారు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నాలాలను నిర్మాణ చేయిస్తామన్నారు. నగరంతో పాటు నగర శివారు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్లను అభివృద్ధి చేయడానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆమె అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగు పర్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, దశల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని మామిడిపల్లి నుంచి మైలార్దేవులపల్లి వరకు హెచ్ఎండీఏ నుంచి రూ.1.57కోట్లతో స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు,ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేందుకు సులువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్రెడ్డి , మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్ పవన్ కుమార్, శివకుమార్, నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.