హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 7 వరకు దోస్త్ ప్రత్యేక విడుత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 9న డిగ్రీ ప్రత్యేక విడుత సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 29న డిగ్రీ ఇంట్రా కాలేజీ సీట్లు కేటాయింపు జరగనుంది.