హైదరాబాద్ : తెలంగాణలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడుత దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. జులై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 6న మొదటి విడుత రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.
ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం కల్పించారు. ఆగస్టు 7 నుంచి 21వ తేదీ వరకు రెండో విడుత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అదే నెల 7 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22న సాయంత్రం రెండో విడుతకు సంబంధించిన డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడుత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 16న మూడో విడుత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి.