DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడుత సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడుతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇందులో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్లో ఉన్న కాలేజీలు 889 కాగా, మొత్తం సీట్లు 3,56,258. ఇక 63 కాలేజీల్లో జీరో అడ్మిషన్స్. డిగ్రీ కామర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖత చూపించారు. 33,251 మంది కామర్స్ కోర్సులను ఎంపిక చేసుకున్నారు.