మహబూబాబాద్ : డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్(MLA Ramachandra Naik) ఆ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకోవడం కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్త గుమ్మడి వెళ్లి శ్రీకాంత్ ఎమ్మెల్యే రాకపై తనకు సమాచారం లేదని, కష్టపడి గెలిపిస్తే తనను ఇంత అవమానపరుస్తారా అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే వచ్చేది నాకెందుకు సమాచారం ఇవ్వరని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ తాగి వచ్చావా అంటూ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. ఎమ్మెల్యే దుశ్చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది.