మెట్పల్లి, ఫిబ్రవరి 4: నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఐదేండ్లుగా ఆయన కార్యకర్తలు, నాయకులను పట్టించుకోలేదని ఆరోపించారు.
రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇల్లెందు కృష్ణమాచారి, మారంపల్లి శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్ ఉన్నారు.