హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): క్యూనెట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సూచించారు. విదేశాల్లో టూర్ల పేరిట తీసుకెళ్లి మోసాలకు పాల్పడుతున్న ఘటనలను ఉదహరించడంతోపాటు సదరు సంస్థపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. క్యూనెట్ ప్రమోటర్లపైనా పలు కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ మోసగాళ్లకు చిక్కకుండా కుటుంబసభ్యుల్లో, స్నేహితులల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు.