Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి బెంగుళూరు వాసి అశ్రిత్, అశోక్ రూ. లక్ష, ఒంగోలుకు చెందిన అపూర్వ కన్స్ట్రక్షన్స్ సురేష్ దంపతులు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.
సోమవారం ఏఈవో ఫణిందర్ప్రసాద్ సమక్షంలో దాతలు విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మ వార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.