నాంపల్లి కోర్టులు, నవంబర్ 8 : దీపావళి పర్వదినం ఆదివారం రావడంతో తర్వాతి రోజు సోమవారానికి సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. 13వ తేదీ(సోమవారం)ని కూడా సెలవుదినంగా పరిగణించాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
అన్ని జిల్లా కోర్టులతోపాటు ట్రిబ్యునల్, లేబర్ కోర్టులకు సైతం సెలవు వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నది.