హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది.. బత్తిని కుటుంబ సభ్యులు (Fish prasadam) హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం(Fish prasadam) అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న(June 8) శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తుంది.
జూన్ 8 ఉదయం పదకొండు గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో(Nampally Exhibition Ground) చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు. చేప ప్రసాదం పూర్తిగా ఉచితంగా భక్తులకు అందిస్తామని అన్నారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో.. మెడికల్ సర్వీస్, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా 24 గంటల పాటు ఉచితంగా భక్తులకు ఇస్తామని చెప్పారు.
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు ప్రసాదాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభు త్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే.. ఈ ప్రభుత్వాన్నిసైతం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.