హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల మొదటివారంలో ప్రారంభిస్తామని మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాసబ్ట్యాంక్లోని మత్స్యశాఖ కార్యాలయంలో ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధర్సిన్హా, కమిషనర్ లచ్చిరాం భూక్యాతో కలిసి జిల్లాల మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ ఏడాది 26,778 జల వనరుల్లో రూ.88.53 కోట్ల వ్యయంతో 68 కోట్ల చేపపిల్లలను, రూ.24.50 కోట్ల వ్యయంతో 275 జల వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేపపిల్లలనే విడుదల చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తిరసరించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
పారదర్శకతలో భాగంగా చేపపిల్లల విడుదల ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని సూచించారు. ఉదయం 9 గంటల లోపే చేపపిల్లల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ వెంటనే సంబంధిత మత్స్యకారులకు విడుదల చేసిన చేపపిల్లల సంఖ్య, రకాలను వివరించి, ప్రత్యేక ధ్రువీకరణ పత్రంలో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ విడుదల చేసిన చేప, రొయ్య పిల్లల వివరాలను టీ-మత్స్య పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. చేప పిల్లల లెకింపులో తప్పిదాలకు అవకాశం లేకుండా, సమయం వృథా కాకుండా ఉండేందుకు అవసరమైన యంత్రాలు కొనుగోలు చేయాలని కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదేశించారు.