శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిలా ఉన్నదని అన్నారు. ఆడబిడ్డలున్న పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దని కల్యాణలక్ష్మి పథకాన్ని చేపట్టి వారికి అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
– మిర్యాలగూడ