నర్సంపేట ;వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం పండుగ వాతావరణంలో దళితబంధు యూనిట్ల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేట మండలంలో మొదటి విడతగా 55 మందికి యూనిట్లను అందజేశారు. నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి లబ్ధిదారులకు కార్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపాయి.