చేర్యాల, అక్టోబర్ 8 ‘సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గుట్ట చరిత్రను ఆదివారం చేర్యాలలో మీడియాకు వివరాలను వెల్లడిస్తున్న డిస్కవరి మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి. ‘కొమురవెల్లి మల్లన్న గుట్ట గతంలో ఆదిమానవుల ఆవాస ప్రాంతం. గుట్టకు తూర్పువైపు ఉన్న భూముల్లో ఎరుపు రంగుల్లో సూక్ష్మరాతి పనిముట్లు లభించాయి.
ఆది మానవులు కొండదిగి తూర్పువైపు ఆవాసాలు ఏర్పర్చుకున్నారు. అందుకు సాక్ష్యంగా ఎరుపు, నలుపు, బూడిద రంగులో ఉన్న కుండపెంకులు చిట్టెపు రాళ్లు లభించాయి. కొమురవెల్లి గుట్ట పై 9 లేదా 10వ శతాబ్దంలో జైన సన్యాసులు ధ్యానం చేసుకొన్నారు. 13వ శతాబ్దం నాటికి కాకతీయుల కాలంలో గుట్ట పై గుహలో పట్టుమన్నుతో చేసిన గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మతో సహా మల్లన్న విగ్రహాలు ఉన్నాయి’ అని రత్నాకర్రెడ్డి తెలిపారు. పురావస్తు శాఖ పరిశోధన చేస్తే విలువైన చరిత్ర వెలుగులోకి వస్తుందని చెప్పారు.