హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థులకు విద్యాసంవత్సరంలో ఎప్పుడైనా అడ్మిషన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ ఆదేశించింది.విద్యాసంవత్సరం ప్రారంభం, మధ్యలో, చివర్లో ఎప్పుడొచ్చినా వీరిని బడుల్లో చేర్పించుకోవాలని స్పష్టంచేసింది. ఇక వందశాతం వైకల్యం ఉన్న విద్యార్థులు పాఠశాలకొచ్చే అవకాశం లేకపోవడంతో వీరికి హాజరు శాతం నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి వెయ్యి మంది విద్యార్థుల్లో ఒకరు ఏదో ఒక వైకల్యానికి గురవుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. వీరిలో అత్యధికులు బుద్ధిమాంద్యం బారినపడుతున్నట్టుగా తేలింది. రాష్ట్రంలో మొత్తం 54,362 మంది పిల్లలు వైకల్యంతో బాధపడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోల్చితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే అధిక విద్యార్థులు వైకల్యం బారినపడుతున్నట్టుగా విద్యాశాఖ తేల్చింది.
దివ్యాంగ విద్యార్థుల కోసం మార్గదర్శకాలివీ..