హైదారాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఆయన కుమార్తె, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం వీరింటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు కాసేపు చర్చించారు. కాంగ్రెస్లో చేరాల్సిందిగా వీరిద్దరిని ఆహ్వానించినట్టు సమాచారం. అయితే ఇందుకు కే కేశవరావు ఒప్పుకోలేదని, విజయలక్ష్మి మాత్రం ఆలోచించి చెప్తానని అన్నట్టు తెలిసింది.