హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనుమడు, మంత్రి కే తారకరామారావు తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావుకు బ్రిటన్కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘డయానా అవార్డు’ దకిం ది. 9-25 ఏండ్ల వయసుండి మానవీయ దృక్పథంతో, సమాజంలో మార్పుకోసం కృషి చేసినవారికి ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పే రు మీద 1999 నుంచి ఈ అవార్డులు అందజేస్తున్నారు. ‘యువతకు ప్రపంచాన్ని మార్చేశక్తి ఉన్నది’ అనేది సంస్థ నినాదం. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో హిమాన్షు సొంతంగా శోమ (Shoma) పేరు తో ప్రాజెక్ట్ను ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్ఖాన్పల్లిని ఎంపిక చేసుకొని స్పాన్సర్ల సహాయంతో ‘కల్తీలేని ఆహార పదార్థాలు’ తయారుచేసే పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను సేకరించటం, వాటిని ప్రాసెసింగ్ చేయటం, ప్యాకింగ్ చేయడం వంటి బాధ్యతలన్నీ గ్రామస్థులకు అప్పగించారు. ఇందులో పనిచేసేవారిలో 50 శాతం మంది మహిళలే, ఈ ప్రాజెక్టులో వినియోగించిన యంత్రాలకు పూర్తిగా సౌరవిద్యుత్తునే వాడటం విశేషం. ఈ ప్రాజెక్టుతో యువతకు, మహిళలకు ఉపాధి కల్పించారు. తన ప్రాజెక్టు ద్వారా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 సాధించినట్టు హిమాన్షు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ఆయన కృషిని బ్రిటన్ సంస్థ గుర్తించి ఈ ఏడాది డయానా అవార్డును అందజేసింది. ఈ అవార్డును హిమాన్షు సోమవారం వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో అందుకొన్నారు.
తాతకు ధన్యవాదాలు.. తండ్రి శుభాకాంక్షలు
అవార్డు వరించిన సందర్భంగా హిమాన్షు స్పందిస్తూ తన ప్రాజెక్టుకు మార్గనిర్దేశనం చేసిన తన తాత, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ‘గ్రామాలు సుస్థిరత సాధించేందుకు నేను చేసిన ఆవిష్కరణ ఎస్హెచ్వోఎంఏ(షోమా)కు డయానా అవార్డు అందుకొన్నానని ఆనందంగా ప్రకటిస్తున్నా. ఇందుకు సహకరించిన గంగాపూర్,యూసఫ్ఖాన్పల్లి ప్రజలకు, నా మెంటార్లకు ము ఖ్యంగా ప్రాజెక్టు ఆసాంతం నాకు మార్గనిర్దేశనం చేసిన మా తాతయ్యకు నా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తా’ అంటూ హిమాన్షు ట్వీట్చేశారు. మరోవైపు తన కుమారుడికి అంతర్జాతీయ గుర్తింపురావడం పట్ల మంత్రి కేటీఆర్ సంతో షం వ్యక్తంచేశారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అవార్డు వచ్చిన సందర్భంగా హిమన్షుకు ఆయన మిత్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 15 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడంపట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.