వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయడానికే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాయపర్తి మండలం ఆరెగూడెంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు, దేశభక్తి సినిమాల ప్రదర్శన, ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ చేస్తున్నామన్నారు.
75 ఏండ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా ఫ్రీడమ్ పార్కు ఏర్పాటుతో పాటు 75 రకాలకు చెందిన 5,625 మొక్కలను నాటాం. 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలంతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.