నమస్తే నెట్వర్క్, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చర్ల, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, భద్రాచలం, అశ్వారావుపేట మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండివైఖరి వీడి నిరుద్యోగ అభ్యర్థుల అభ్యర్థనను పట్టించుకోవాలని, డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కావాలనే పరీక్షలను వెంటవెంట నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్, నాయకులు సత్యవరపు సంపూర్ణ, నారం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో బీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడు కట్టా రమేశ్ తహసీల్దార్ రవీందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంగావత్ లక్ష్మణ్నాయక్, సాయి కుమార్, పాషా, శీలంశెట్టి రమేశ్, ఎండీ ఖదీర్బాబా, పానుగంటి రాధాకృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.