హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, కన్వీనర్ గుజ్జ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.