నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ వద్ద పలు దళిత సంఘాలు ధర్నా(Dharna) చేశాయి.
దళితుల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయొద్దని డిమాండ్ చేశారు. గతంలో మంజూరైన యూనిట్లకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది దళితులు ఆర్థికంగా బాగుపడ్డారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళితబంధు పథకం అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.