ధర్మారం: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పతకాలు సాధించారు. సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న బీ ప్రదీప్తి బాలికల అండర్ 18 విభాగంలో 5000 మీటర్ల రేస్ వాకింగ్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. మరో విద్యార్థిని శ్రీలత ద్వితీయ స్థానం సాధించి వెండి పతకాన్ని సొంతం చేసుకుంది.
అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బీ సందీప్ అండర్ 20 విభాగంలో 10000 మీటర్ల రేస్ వాకింగ్లో మూడ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ నెల 22, 23 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగాయి. పతకాలు నెగ్గిన విద్యార్థులను మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె మునిందర్, ఎ రాజేశం అభినందించారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుడు బైకని కొమురయ్య, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.