హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా కొవిడ్-19 కారణంగా 12 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,175 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,461 గా ఉంది. 1.36 శాతం కరోనా పాజిటివిటీ రేటు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1.10,681 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కరోనా కేసులు నమోదు అవగా ఖమ్మంలో 139, నల్లగొండలో 113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.