హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో 2014 నుంచి ఇప్పటి వరకు 45,113 ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాటు తమకు నిరంతరం మద్దతు ఇస్తున్న సీఎం కేసీఆర్కు రాష్ట్ర పోలీసుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డీజీపీ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్రజలకు అంకితభావంతో పని చేస్తామని హామీ ఇస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు.
కమ్యూనిటీ ఎంపవర్మెంట్లో భాగంగా.. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సహాయంతో యువతను పోలీస్ ఫోర్స్లో చేరేలా ప్రోత్సహించాలని జిల్లాల సీఎస్పీలు, ఎస్ఎస్పీలను ఈ సందర్భంగా డీజీపీ ఆదేశించారు. సంబంధిత యూనిట్లలో ప్రీ ర్రికూట్మెంట్ కోచింగ్ కార్యక్రమాలను సైతం ప్రారంభించాలన్నారు.
పోలీసు శాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. ఆ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. 18,334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
All CsP and SsP are instructed to initiate pre-recruitment coaching programs in their respective units, as a part of Community Empowerment, encouraging youth to join the police force with the assistance of the Skill Development Department and ensure successful participation. pic.twitter.com/A8NDE05tIi
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) March 9, 2022
On behalf of Telangana Police, our sincere thanks to Honourable CM Garu for his continuous support since 2014 in strengthening the TS Police making total recruitment to 45,113.
We, TS police assure to serve the people with utmost dedication and devotion. pic.twitter.com/uHUZ1pPTaU
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) March 9, 2022