హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగే మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 12 వేల మంది పోలీసు బలగాలు పహారా కాస్తాయని డీజీపీ బీ శివధర్రెడ్డి వెల్లడించారు. పోలీసులతోపాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు కూడా నిరంతరం పహారా కాస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెకింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసినట్టు తెలిపారు.