హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ, తెలంగాణకు సరిహద్దు రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్కు చెందిన వామపక్ష తీవ్రవాదపార్టీల సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించా రు.
సైబర్ నేరాల నివారణకు కనీసం పది మంది పోలీసు అధికారులకు ప్రత్యేక్ష శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హాట్స్పాట్లను గుర్తించి, రోడ్ ఇంజినీరింగ్ చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే పౌరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించవద్దని సూచించారు. నవ సమాజ నిర్మాణానికి పోలీసులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అడిషనల్ డీజీలు మహేశ్ భాగవత్, సంజయ్కుమార్ జైన్, విజయ్కుమార్, శిఖా గోయెల్, సందీప్ శాం డిల్య, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఐజీలు కమలాసన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసీం, డీఐజీ రమేశ్రెడ్డి పాల్గొన్నారు.