అక్షయవిద్య స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది పేద విద్యార్థులకు శుక్రవారం డీజీపీ అంజనీకుమార్ లాప్టాప్లను అందించారు.
నగరంలోని సింగరేణికాలనీ, రసూల్పురా తదితర బస్తీలకు చెందిన యువతీ, యువకులకు సంస్థ ల్యాప్టాప్లు అందజేయగా, యువతకు సంస్థ తోడ్పాటునందించడం ప్రశంసనీయమని డీజీపీ అన్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో సీటు సాధించిన రమేశ్ను ప్రత్యేకంగా అభినందించారు.