హైదరాబాద్ : ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.
టీ.ఎస్.ఎస్.పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీ సంజయ్ జైన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు తదితర అధికారులతో కలసి నూతన సచివాలయం ప్రాంగణంలో మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ(ublic Meeting) , వీవీఐపీ ల ప్రవేశం, పార్కింగ్( Parking) ఏర్పాట్లు, సచివాలయంలోకి సిబ్బంది, అధికారుల ప్రవేశ మార్గంలో బందోబస్తు, తదితర ఏర్పాట్లను డీజీపీ అధికారులతో కలసి సమీక్షించారు.