ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి.
ఉదయం నుంచే భారీ క్యూలైన్లలో గణనాయకుడి దర్శనానికి నిరీక్షించారు. లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ తెలిపింది.