లింగాల : ‘వస్తున్నాం లింగమయ్యా’.. అంటూ భక్తుల శివనామస్మరణతో నల్లమల పులకించిపోయింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన నాగర్కర్నూల్ జిల్లాలోని సలేశ్వరం జాతరకు భక్తజనం పోటెత్తుతున్నది. రెండోరోజైన శనివారం స్వామివారి దర్శనం కోసం లక్ష మందికిపైగా తరలివచ్చారు. రాళ్లూరప్పలు, గుట్టలు, లోయలు దాటుతూ చిన్నాపెద్ద తేడా లేకుండా సాహసయాత్రగా లింగమయ్యను దర్శించుకొన్నారు. చెంచు పూజారులు గిరిజన సంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వర్షం కురవడంతో కొంతసమయం వాహనాలు నిలిచిపోయాయి.